వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ జగతి కేసును బదిలీ చేయండి: కోరిన ఈడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ అక్రమాస్తుల కేసులలో జగతి పెట్టుబడుల కేసును ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తన పిటిషన్‌లో ఈడీ తెలిపింది.

సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిన ఈ కేసును తమశాఖ కోర్టుకు బదిలీ చేయాలని లోగడ ఈడీ అధికారులు కోరగా సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే పీఎంఎల్‌ చట్టంలోని సెక్షన్‌ 44(1)(సి)ని అన్వయిస్తూ తాజాగా ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది.

YS Jagan

ఇక ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో నిందితుడైన శ్రవణ్‌ గుప్తా విదేశీ ప్రయాణానుమతి సెప్టెంబర్‌ 2తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా విజ్ఞప్తి మేరకు ఆర్నెల్లు పొడిగిస్తూ సీబీఐ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్ర, ఎకె దండమూడిలు పెట్టిన రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసు సిసి 9/2ను ఈడి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరింది.

ఇదిలావుంటే, వ్యాపార వ్యవహారాల నిమిత్తం మరో ఆరు నెలల పాటు విదేశాలకు వెళ్లడానికి ఎమ్మార్ కేసులో నిందితుడైన శ్రవణ్ గుప్తాకు సోమవారం సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.

English summary
Enforcement Directorate (ED appealed to the CBI court to transfer YSR Congress president YS Jagan's Jagathi publiications case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X