ఇబ్రహీంపట్నంలో భారీగా పట్టుబడిన డబ్బు: ఎవరిది?
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసంతృప్తులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్లు చేస్తున్నారు.
అందుకే సస్పెండ్ చేశారా? కేసీఆర్ వెంట తెలంగాణ ద్రోహులు: రాములు నాయక్ కంటతడి
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా నగదు ప్రవాహంపై దృష్టి సారించింది. ఎన్నికల స్క్వాడ్లను రంగంలోకి దించి ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎన్నికల స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న దాదాపు 27లక్షల నగదును ఎన్నికల స్క్వాడ్ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సొమ్ము ఆదిపట్ల గ్రామ ఉపసర్పంచ్ పల్లె గోపాల్ గౌడ్కు చెందినగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆ సొమ్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డికి చెందినదిగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.