తెలంగాణాలో ఎన్నికల హీట్..! టీటీడిపి నేతలతో చంద్రబాబు మీట్...!
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు సంబందించిన సన్నాహాలు కూడా చకచక జరిగిపోతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహరచలో మునిగిపోయాయి. ఐతే తెలంగాణలో ఒకప్పుడు చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ పునాదులను పటిష్టం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకోసం పార్టీ జాతీయ అద్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన సమయం కూడా సమీపించింది. గతమెప్పుడూ చరిత్రగా భావించే తెలుగుదేశం పార్టీ ఈ సారి మాత్రం గతం గుణపాఠంగా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణాలో తిరుగులేని ఆదిక్యం నుండి ఉనికి కోల్సోయే పరిస్థితికి దిగజారిన పరిణామాలను విశ్లేషించుకోవాల్సిన సందర్బం వచ్చేసింది. పార్టీ శ్రేణులు బలంగా ఉన్నప్పటికి వారి మనోస్తైర్యాన్ని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాల రూపకల్పన జరగాలి. మొక్కవోని కార్యకర్తల ఆత్మవిశ్వాసాలకు అనుగుణంగా నాయకుల నైజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం పార్టీ అదినేత చంద్రబాబు తెలంగాణా తెలుగుదేశం పార్టీ పైన ద్రుష్టి సారించి పకడ్బందీ కార్యాచరణ రూపొందింల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఎందుకు చతికిలబడింది..?
ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుండి మరో లెక్క అనే రీతిలో చంద్రబాబు క్యాడర్ లో ఉత్తేజపూరిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉత్పన్నమైంది. హైదరాబాద్ నగరాన్ని అభివ్రుద్ది చేసిన అంశాలు, మిగులు బడ్జెట్ సాధించిన ప్రణాళికలు ఇప్పుడు పార్టీలో చర్చిండం అప్రస్తుతం. అది చరిత్ర. ఒక్కోసారి చరిత్రను కూడా గుణపాఠంగా మలుచుకోవాల్సిన విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి. ప్రస్తుతం తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ అలాంటి పరిస్థితిలో ఉంది. పార్టీలో నూతన జవసత్తువలు నింపి పూర్వవైభవం సాదించేందుకు రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నడుం బిగించాలి. తెలంగాణా లో పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్న అంశాలను విశదీకరించుకుంటూ జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి అడుగులు వేయాలి. ఎన్నికలకు సన్నద్దం అవుతున్న ఇతర పార్టీతో పోటీ పడే విధంగా కార్యాచరణ రూపొందించాలి.
స్థానిక నాయకత్వం చురుగ్గా పనిచేయాలి..!పూర్తి సహకారం ఉంటుందంటున్న బాబు..!
ఆనాడు ఎన్టీఆర్ లో అభివ్రుద్ది మంత్రాన్ని ప్రజలు గ్రహిస్తే చంద్రబాబులో అలుపెరగని ఆత్మవిశ్వాసాన్ని గ్రహించారు. తెలుగు ప్రజలకు అన్న ఆరాద్య దేవుడైతే చంద్రబాబు ఒక భరోసా లా అవతరించారు. అందుకే 1995 నుండి 2004 వరకు చంద్రబాబు సాహసోపేతమైన ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు. అదే అనుభవాన్ని తెలంగాణాలో పార్టీ మసకబారకుండా ఉపయోగించాలి. విభజన తర్వాత తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కకావికలం అవుతున్న సందర్బాలకు చంద్రబాబు స్వస్థి పలికి పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలి. పార్టీ ఐక్యతను దెబ్బతీస్తున్న భిన్న స్వరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన సమయం కూడా వచ్చేసింది. రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్క విభేదాలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది.
కొత్త నాయకుడు కావాలంటున్న కార్యక్తలు..! కార్యకర్తలే నాయకులుగా ఎదగాలంటున్న బాబు..!
తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం కోసం ఛరిష్మా ఉన్న కొత్తమొఖాలను పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు తగు సమయం కేటాయిస్తే పార్టీ ఊపందుకుంటుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణాలో గ్రామ కమిటీల దగ్గర నుండి రాష్ట్ర కమిటీల వరకు చంద్రబాబు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేట్టు జాగ్రత్తలు తీసుకుంటే పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుంది. గతాన్ని పదే పదే నెమరు వేసుకోవడం కాకుండా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్పష్టత ఇవ్వగలగడంతో పాటు ప్రజల్లో నాయకుల పట్ల విశ్వసనీయత కలించే దిశగా కార్యచరణ నిర్ధేశించుకుంటే తెలంగాణాలో పార్టీ బలోపేతం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే చంద్రబాబుతో అన్ని జనరేషన్లు అనుసంధానం అవ్వడం తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసివచ్చే అంశం. ఇదే అంశాన్ని తెలంగాణా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లగలిగితే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
Recommended Video
అంతా ఓకే..! చురుకైన నాయకత్వం ఉంటే పార్టీ పట్టాలెక్కినట్టే..!!
ఎప్పుడో ఒకసారి కాకుండా నెలకు రెండు సార్లు తెలంగాణా కోసం బాబు సమయం కేటాయిస్తే పార్టీలో ఉత్సాహం నెలకొంటుంది. బాబు తెలంగాణాలో తరుచుగా నిర్వహించే సమావేశాల ద్వారా యువరక్తం కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు అనుభవానికి యువరక్తం తోడైతే తెలంగాణా లో ఊహించని స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజాకార్యక్రమాలు మరింత పదును పెరగాలంటే చంద్రబాబు ప్రత్యక్ష జోక్యం ఎంతైనా అవసరం ఉంది. చంద్రబాబు కార్యాచరణ పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని దూరం చేసే విధంగా ఉండాలన్నది ప్రతి కార్యకర్త ఆకాంక్షగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఆ దిశలోనే పార్టీకి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు నాంది పలుకుతారని పార్టీ శ్రేణులతో పాటు నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది కాబట్టి అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా సమాయత్తం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.