ముగిసిన నామినేషన్ల ఘట్టం, రేపు పరిశీలన, 28న తుది జాబితా
న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 22 రాష్ట్రాల్లో తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సోమవారం మధాహ్నం 3 గంటల వరకు దాఖలు చేసేందుకు సమయం ఉండటంతో .. అభ్యర్థులు తమ నామపత్రాలను వేశారు.
18న నామినేషన్లు షురూ
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఏపీలోని 175 అసెంబ్లీ సహా 25 పార్లమెంట్ స్థానాలకు వివిధ పార్టీల నుంచి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి 4 రోజులు నామినేషన్లు తక్కువగా దాఖలు కాగా .. 22వ తేదీన అధికంగా వేశారు. అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలను సమర్పించారు.
వరుసగా రెండురోజులు సెలవులు, నేడే చివరిరోజు
నామినేషన్ ప్రక్రియకు హోళీ సెలవు రోజు రాగా, 24వ తేదీ ఆదివారం కూడా హాలీ డే వచ్చింది. ఈ రెండురోజులను మినహాయిస్తే .. సోమవారమే ఆఖరి రోజు కావడంతో ఎన్నికల బరిలో దిగేందుకు నేతలు పోటీపడ్డారు.
పరిశీలన, ఉపసంహరణ
అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను రేపు రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 28 వరకు ఉపసంహరించేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ రోజు వరకు ఎవరు బరిలో ఉంటారో ప్రకటిస్తారు. తొలివిడుత ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనుండగా .. ఫలితాలను మే 23న చేపడుతారు. అంటే ఓటింగ్కు కౌంటింగ్ నెల 15 రోజుల సమయం ఉంది.