వచ్చే నెల నుండి పెంచిన రెండువేల పెన్షన్ చెల్లిస్తామం : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది...ఈనేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో వృద్యాప్య పెన్షన్ ను వెయ్యి రుపాయల నుండి 2016 పెంచుతామని మ్యానిఫెస్టో లో పెట్టారు..దీనితోపాటు మరిన్ని హమీలు టిఆర్ఎస్ ప్రభుత్వం హమీలు ఇచ్చింది..అయితే ముందుగా ఎప్రిల్ నుండి వృద్యాప్య పెన్షన్ ను ఇవ్వబోతున్నట్టు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం వనపర్తి లో చెప్పారు..
అయితే ఎన్నికల హామీలో మార్చి బడ్జెట్ తర్వాత పెంచిన పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పారు.ఇందుకు అనుగుణంగానే తెలంగాణలో ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడ రూ.12 వేల కోట్లను బడ్జెట్ ను పోందుపర్చారు.కాగా గతంలో సుమారు 40 లక్షల పెన్షలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది..అయితే వృద్యాప్య పెన్షన్ వయస్సును 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించారు..దీంతో మరో ఇరవై లక్షల మంది పెన్షనర్లు కోత్తగా జాబితాలో చేరనున్నట్టు అంచనా వేస్తున్నారు..ఇందుకు సంబంధించి సిఎమ్ కేసిఆర్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు..