ఉప్పల్స్టేడియంలో గర్ల్స్కి ఈవ్టీజింగ్: టెక్కీలు అరెస్ట్
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో షి బృందానికి ఈవ్ టీజర్లు పట్టుబడ్డారు. మద్యం మత్తులో అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తున్న బీటెక్ విద్యార్థులను, సాఫ్టువేర్ ఇంజనీర్లను పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. షీ బృందం ఈ విషయాలను వెల్లడించింది.
షీ బృందం ఎస్సైలు శ్రీనివాస్, నాగార్జున్లు మాట్లాడుతూ.. స్టేడియంలో శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ చూసేందుకు హబ్సిగూడకు చెందిన ధీరజ్ రెడ్డి, రేవంత్, అభిషేక్ రెడ్డి, ప్రేంరావు అనే బీటెక్ విద్యార్థులు, నారాయణ తేజ్, శివశంకర్ అనే సాఫ్టువేర్ ఇంజనీర్లు వచ్చారు. ఆరుగురూ స్టేడియంలోని కార్పోరేట్ బాక్సుల్లో కూర్చున్నారు.
మద్యం తాగి అక్కడి అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేశారు. దీనిని గమనించిన షీ టీమ్స్ వీరిని పట్టుకున్నాయి. అయితే, షీ టీమ్స్ పైకి వారు తిరగబడే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రిమాండుకు తరలించారు.