చట్టం చదువుకుని, మున్సిపల్ ఎన్నికల్లో పోటికి దిగండి : కేటీఆర్
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటిచేయాలనుకునే వారు చట్టాన్ని ఒకటికి రెండు సార్లు సవరించిన మున్సిపల్ చట్టాన్ని చదువుకుని పోటీలోకి దిగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుత మున్సిపల్ చట్టాన్ని చాల కఠినంగా ఉండే విధంగా రూపోందించినట్టు ఆయన చెప్పారు. కొత్త చట్టం ప్రకారం పని చేయని వారు ఇంటికి పోయో నిబంధనలు ఉన్నాయని అన్నారు. తొలగించిన కార్పోరేటర్లను, కౌన్సిలర్స్ను తిరిగి తీసుకునే అధికారం మంత్రికి కూడ లేదని వివరించారు. ప్రజలకు ఖచ్చితంగా సవే చేయాలనే లక్ష్యం ఉన్నవాళ్లే మున్సిపల్ ఎన్నికల రంగంలోకి దిగాలని ఆయన సూచించారు. తర్వాత తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు.
40 ఏళ్లలో చేయనిది 4 ఏళ్లలో చేశాం.. హుజూర్నగర్కు ఉత్తమ్ చేసిందేమీ లేదన్న కేటీఆర్
నాగార్జునసాగర్ హైవే మంగళ్పల్లి, మరియు విజయవాడ హైవేపై వద్ద రెండు లాజీస్టిక్ పార్కులను ఆయన ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.హైదరాబాద్ చుట్టుపక్కల సబర్బన్ ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకోసం మరో ఎనిమిది మల్టిమోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రారంభించనున్నట్టు కేటీఆర్ చెప్పారు.
ఈనేపథ్యంలోనే ఔటర్రింగ్ రోడ్డు ప్రాంతంలో పారీశ్రామికంగా అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. ఇదంతా కూడ స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. కాగా స్థానిక నాయకులు ఉద్యోగాలు ఇప్పించడంలో ప్రైవేట్ కంపనీల వెంటపడి ఉద్యోగాలు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. మరోవైపు ఉద్యోగ నైపణ్యంలో శిక్షణపై కూడ దృష్ఠి సారించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.