హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఫోటో: ఈత రాక ప్రాణం పోయింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Facebook fun ends youth life in hyderabad
హైదరాబాద్: ఈతకొడుతూ ఫోటోలు దిగి ఫేస్ బుక్‌లో పెట్టాలనే తాపత్రయంతో కుంటలోకి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే పాతబస్టీలోని కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడకు చెందిన సురేందర్ రెడ్డి తన మిత్రులు నాగేందర్, శివకుమార్, సంజయ్, ప్రణయ్, అమర్, నవీన్ కుమార్‌లతో కలిసి కొంగరకలాన్ గ్రామ సమీపంలోని బొడకుంటకు ఈతకు వెళ్లారు.

ఫోటోలు దిగేందుకు కుంటలోకి దిగిన సురేందర్ రెడ్డి (21) ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడదామని ప్రయత్నించినా కుంట ఎక్కువ లోతు ఉండటంతో ఫలితం లేకపోయింది. దీంతో అతని స్నేహితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సామాచారం ఇచ్చారు.

మంగళవారం ఉదయం శవమై తేలిన సురేందర్ రెడ్డి మృతదేహాన్ని ఎస్‌ఐ ఇప్తికార్ అహ్మాద్ నేతృత్వంలో పోలీసులు బయటకు తీశారు. మృతదేహాన్ని స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక సురేందర్ రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి ఉప్పరిగూడలో ఓ చిన్న టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నాడు. యుక్త వయసున్న కొడకు అర్దాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

English summary
Facebook fun ends youth life in hyderabad. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X