వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్ల‌క్ష్యం..!

|
Google Oneindia TeluguNews

నారాయణఖేడ్/హైద‌రాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 52 సంవ‌త్స‌రాల రైతు అంతారం ఈర్‌రెడ్డి కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా బేగంపేటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మొదటి విడత రైతుబంధు కింద ఆయనకు 32,800 చెక్కు మంజూరైంది.

Farmer dead due to Rythu Bandhu scheme negligence..!!

ఇక రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈర్‌రెడ్డి ఇంటి పేరుతో పాటు బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ తప్పుగా నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్‌రెడ్డి తరచుగా దిగులు పడేవాడు. ఈనెల 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి శుక్రవారం ఉదయం సొంత వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
A farmer committed suicide because he did get Rtrhu Bandhu scheme cheque amount in intime. This incident happened in the district of Sagareddy, Narayanakade Mandalam Satyagama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X