హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బావ అనుమానం: సౌమ్య హత్య కేసులో కొత్త కోణం!: తల్లి కన్నీరుమున్నీరు

సౌమ్య హత్య కేసులో మరో కోణం వెలుగు చూసింది. సౌమ్యకు రెండేళ్ల క్రితమే పెళ్లయిందని, విడాకులు తీసుకున్నదని బంధువులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సౌమ్య హత్య కేసులో మరో కోణం వెలుగు చూసింది. సౌమ్యకు రెండేళ్ల క్రితమే పెళ్లయిందని, విడాకులు తీసుకున్నదని బంధువులు చెబుతున్నారు.

చదవండి: మాట్లాడాలి రమ్మని మరదలిని అక్కడికి పిలిచి: నమ్మినందుకు ఎంత పనిచేశాడంటే?

ఇంటర్‌లో ఉన్న సమయంలోనే సౌమ్యకు పెళ్లి చేశారని, అయితే ఆ పెళ్లి నచ్చకపోవడంతో ఆమె అత్తింటికి వెళ్లలేదని, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని చెబుతున్నారు.

తమకు తెలియదని బంధువులు

తమకు తెలియదని బంధువులు

కృష్ణయ్యకు సౌమ్య మరదలు అవుతుందని, వీరి మధ్య ఎలాంటి అనుబందం ఏర్పడిందన్న విషయం తెలియదని, అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని కూడా బంధువులు చెబుతున్నారు. సౌమ్య హత్యతో ఆమె కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. సౌమ్య మృతదేహాన్ని వెలికితీసిన ఐడీఎల్ చెరువు వద్ద సమస్య తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. తమ బిడ్డను కృష్ణయ్య అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడని వారు ఆరోపించారు.

పెళ్లి చేసుకుంటానన్నాడు, ప్రేమించుకున్నారు

పెళ్లి చేసుకుంటానన్నాడు, ప్రేమించుకున్నారు

సౌమ్య చింతల్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కృష్ణయ్య క్యాబ్ డ్రైవర్. విడాకుల నేపథ్యంలో ఆ మధ్య ఓ వివాహ వేడుకలో సౌమ్యకు కలిసిన దూరపు బంధువు, వరుసకు బావ అయ్యే కృష్ణయ్య ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. దీంతో గత ఆరు నెలలుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు.

మరో వ్యక్తితో సన్నిహితంగా

మరో వ్యక్తితో సన్నిహితంగా

ఈ క్రమంలో సౌమ్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించిన కృష్ణయ్య ఆమెను హెచ్చరించాడు. ఇటీవల ఫోన్ చేసినప్పడుల్లా ఫోన్ వెయిటింగ్ వస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలోను ఆమె తన స్నేహితులతో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతనికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో ఆమె పైన దాడి చేసిన కృష్ణయ్య ఆమెను హతమార్చాడు.

 కసి పెంచుకున్నాడు

కసి పెంచుకున్నాడు

ఆమె మరొకరికి దగ్గర అవుతుందని భావించి కసి పెంచుకున్నాడు కృష్ణయ్య. మాట్లాడాలంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి ఛాతిపై బలంగా కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు.

శుక్రవారం ఏం జరిగిందంటే..

శుక్రవారం ఏం జరిగిందంటే..

సౌమ్య శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదో రోజు ఉదయం సౌమ్య, కృష్ణయ్యలు షాపూర్ నగర్‌లోని ఓ మెడికల్ షాపు వద్ద కలుసుకున్నారు. కృష్ణయ్య ఆమెను క్యాబ్‌లో ఎక్కించుకొని జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని హెచ్ఎంటి ప్రాంతానికి తీసుకు వెళ్లి హత్య చేశాడు.

English summary
A 19 year old college student was strangled to death in Kukatpally near Hyderabad on Friday evening by her fiance who was jealous that she was active on social media. The Kukatpally Police said that R Soumya, 19, a first year degree college student, was strangled by her fiance K Krishnaiah, a cab driver, and dumped her body in the IDL lake near Kukatpally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X