ప్లెక్సీ వివాదం: మేయర్ బొంతు సాక్షిగా బూతులు తిట్టుకున్న ఎమ్మెల్యే, కార్పోరేటర్
హైదరాబాద్: ఓ అభివృద్ధి కార్యక్రమం టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పోరేటర్ల మధ్య చిచ్చుపెట్టింది. మైలార్ దేవరపల్లిలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజేంద్ర గౌడ్, స్థానిక కార్పోరేటర్ వర్గాల బాహాబాహికి దిగాయి. మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో విధ్వంసాన్ని సృష్టించారు.
ప్లెక్లీ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. కార్యక్రమం కోసం తీసుకొచ్చిన ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతో సభాస్ధలి వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి అనుచరులు బూతులు తిట్టుకున్నారు.
ఎమ్మెల్యే, కార్పోరేటర్ అనుచరులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసే ప్రయత్నం చేశారు.