కాకతీయ యూనివర్సిటీలో చొక్కాలు పట్టుకొని విద్యార్థుల బాహాబాహీ
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి.
అయితే తాము బంద్ పాటించమని ఇంజినీరింగ్ విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్థి సంఘాలకు, ఇంజినీరంగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగారు.
ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కేయూలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు రెండు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
కేయూ నుంచి స్పందన లేకపోవడంతో బందుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఇంజినీరంగ్ డిపార్టుమెంటును బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా.. వారు అడ్డు తగిలారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.