పెళ్లింట డీజే చిచ్చు.. డ్యాన్సులొద్దని వరుడు, స్టెప్పులేయాల్సిందేనన్న వధువు.. డిష్యూం.. డిష్యూం...
Recommended Video
అవును పెళ్లింట డీజే చిచ్చుపెట్టింది. పచ్చటి తోరణాల మధ్య ఇరుకుటుంబాలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. రెండు స్టెప్పులులేసే విషయం కాస్త.. ముష్టిఘాతానికి దారితీసింది. సూర్యాపేట జిల్లాలో రెండురోజుల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరు కుటంబాల మధ్య గొడవకు డీజేనే కారణం కావడం విశేషం.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయ గ్రామంలో రెండురోజుల క్రితం పెళ్లయ్యింది. వధువు, వరుడును ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు. దీవించారు. భోజనాలు ముగిసి.. అప్పగింతల సమయం వచ్చేసరికి సీన్ మారిపోయింది. పెళ్లికూతురు తరఫు బంధువులు డీజే తీసుకొచ్చారు. ఇప్పుడు డీజే ఎందుకు అనడంతో గొడవ జరిగింది. అప్పగింతలు కాదు కదా ముష్టిఘాతానికి దారితీసింది.
డీజే తీసుకొస్తే ఆలస్యవుతుందని పెళ్లికొడుకు తరఫువారు భావించారు. వద్దని చెప్పారు. కానీ పెళ్లి కూతురు తరఫువారు వినిపించుకోలేదు. దీంతో మాటా మాటా పెరిగింది. చేతులు లేసి దాడులకు దారితీసింది. పెళ్లింట కర్రలు లేచి.. తలలు పగిలాయి. కొందరు కల్పించుకొని గొడవ వద్దని చెప్పినా వినిపించుకొని పరిస్థితి నెలకొంది. కర్రలు, కుర్చీలు లేవడంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నవ్వులు పూసేచోట ఉద్రిక్త సిచుయేషన్ ఏర్పడింది. డ్యాన్స్ సీన్ కాస్త ఫైట్ సీన్గా మారింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో కొందరికీ గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ వీడియోను కొందరు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ ట్రోల్ అవుతోంది.