సికిందరాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం .. పలు ఫైళ్ళు దగ్ధం
సికింద్రాబాద్ రైల్ నిలయంలోని 7 వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది . శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్ళు దగ్ధం అయ్యాయి . షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం కాగా కంప్యూటర్, టెలి కమ్యూనికేషన్ కు సంబంధించిన డ్రాయింగ్స్ కాలిపోయినట్లు తెలిపారు. పొగలు వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో 7 వ అంతస్తులోంచి పొగలు రావడం తో స్థానికులు సమాచారం ఇచ్చారని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
2017 లో కూడా రైల్ నిలయంలోని ఏడో అంతస్తులోనే అగ్ని ప్రమాదం జరిగింది .అప్పుడు కూడా రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి మంటలను అదుపు చేశారు. ఏడో అంతస్తుపైన శ్లాబ్కు తారు తో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో గ్యాస్ సిలిండర్కు మంటలు వ్యాపించాయి. సకాలంలో సిబ్బంది స్పందించడంతో అప్పుడు సైతం పెను ప్రమాదం తప్పినట్లయింది.