తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు: రెండు బోగీలు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Recommended Video
న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్గఢ్ వద్ద నేటి ఉదయం 7.45గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఓ బోగి పూర్తిగా కాలిపోయింది.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన రైళ్లు ఆగిపోయాయి.
ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముందుగా బీ1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ.. ఆ తర్వాత ఎస్-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది.
బ్రేక్
బైండింగ్
గట్టిగా
పట్టి
వేయడంతో
పొగలు
వ్యాపించాయని
ఉత్తర
రైల్వే
సీపీఆర్ఓ
ఓ
ప్రకటనలో
తెలిపారు.
ప్రమాదానికి
గల
కారణాలపై
విచారణ
జరుపుతున్నట్లు
తెలిపారు.
ప్రయాణికులకు
ఎలాంటి
హాని
కలకగకపోవడంతో
అంతా
ఊపిరిపీల్చుకున్నారు.