అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు: తీవ్రగాయాలు
హైదరాబాద్: అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు జరిగాయి. షికాగోలోని మిషిగాన్ అవెన్యూలో నగరానికి చెందిన మహ్మద్ ముజీబుద్దీన్పై దుండుగులు కాల్పులు జరిపారు. దీంతో ముజీబుద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని షికాగో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల విషయాన్ని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ నిర్ధారించారు. బాధితుడికి అవసరమైన సాయం చేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్, భారత రాయబార కార్యాలయానికి ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఆయన ట్వీట్కు ఇండియా ఇన్ షికాగో కాన్సులేట్ స్పందించింది. ముజీబుద్దీన్ కుటుంబసభ్యులను సంప్రదించామని, అతనికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఇది ఇలావుండగా, ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తిపై అమెరికాలోని షికాగోలో కాల్పులు జరిగాయి. కారు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న చంచల్గూడ వాసి సిరాజ్పై దుండగులు కాల్పులు జరిపారు. డిసెంబర్ 4వ తేదీన తెల్లవారుజామున సిరాజ్పై షికాగో నార్త్ ఆఫ్ డెవన్ వద్ద నాలుగుసార్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు కారుకు తగలడంతో సిరాజ్ క్షేమంగా బయటపడ్డారు.
.@DrSJaishankar Sir,One Hyderabadi Mohd Mujeebuddin-43 has been shot at 11300 block of S Michigan Avenue & shifted to University of Chicago Hospital in a very critical condition. Pl ask @IndiainNewYork, @IndiainChicago to reach out to him. @USAmbIndia @USAndIndia @USAndHyderabad pic.twitter.com/LXJDwhnRip
— Amjed Ullah Khan MBT (@amjedmbt) December 21, 2020