కెనడాలో తెలుగు అమ్మాయి పైన దుండగుల కాల్పులు, మృతి
హైదరాబాద్: కెనడాలో ఓ తెలుగు అమ్మాయి పైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్ర గాయాలకు గురైంది. బాధితురాలిని హైదరాబాదుకు చెందిన జాన్ సింథియాగా గుర్తించారు. ఆమె పైన ఓ షాపింగ్ మాల్లో కాల్పులు జరిగాయి.
ఆమె షాపింగ్ మాల్లో వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఘటనాస్థలిని పోలీసులు సందర్శించారు. దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్పుల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
కాగా, ఈ ఘటన ఏప్రిల్ 29న టొరంటో సమీపంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన అమ్మాయి జాన్ సింథియా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జాన్ సింథియా తల్లిదండ్రులు శోభ, జాన్ కృపవరం పదహారేళ్లుగా కెనడాలో ఉంటున్నారు. యువతి మృతితో ఆమె బంధువుల ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.