ఆర్థిక ఇబ్బందుల్లేవు, అనుమానాల్లేవు: రవీందర్ రెడ్డి, కేక్లో విషం కలుపుకొని ఆత్మహత్య
తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని నార్సింగి కొల్లూరు సమీపంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని నార్సింగి కొల్లూరు సమీపంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్లో కలకలం: ఇద్దరు అమ్మాయిలు, తనయుడు సహా కుటుంబం ఆత్మహత్య
ఇది కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుడు రవీందర్ రెడ్డి సంఘటనస్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యుల మృతిపై ఆయన స్పందించారు.
ఆర్థిక ఇబ్బందులు లేవన్న రవీందర్ రెడ్డి
తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి వెల్లడించారు. తాము స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. బయటకు వెళ్తున్నామని చెప్పి వాళ్లు ఇంటికి తిరిగిరాలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఎవరిపైనా అనుమానాలు లేవు
తమ కుటుంబానికి ఎవరితోను విభేదాలు లేవని రవీందర్ రెడ్డి చెప్పారు. కాబట్టి తమకు ఎవరి పైనా అనుమానాలు లేవని వెల్లడించారు. కాగా, నార్సింగి సమీపంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో ప్రభాకర్ రెడ్డి (28, మాధవి (25), వర్షిత్ (3) ఒకే కుటుంబంలోని వారు. లక్ష్మీ, సింధూజలు దగ్గరి బంధువులు. లక్ష్మి.. రవీందర్ రెడ్డి సతీమణి. సింధూజ.. రవీందర్ రెడ్డి కూతురు
కేకులో విషం కలుపుకొని ఆత్మహత్య
కాగా, ఈ ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వారు కేక్లో విషం కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సమీపంలో కేక్ బాక్సు కనిపించింది
తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. అయితే మృతదేహాలకు సమీపంలో ఓ కేక్ బాక్సు కనిపించింది. దీనిని పరిశీలించిన పోలీసులు.. కేకులో విషం కలుపుకొని తిన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు.