నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదుగురు జనశక్తి నక్సలైట్ల అరెస్టు (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి అటవీప్రాంతంలో ఐదుగురు జనశక్తి నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో జనశక్తిజిల్లా బాధ్యుడితో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

గురువారం రత్నగిరిపల్లి అటవీప్రాంతంలో జనశక్తి పార్టీ సభ్యులు సమావేశమైనట్లు తెలుసుకుని డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో దాడి చేసి నిజామాబాద్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శి వెంపటి కుమార్, ఏదులకంటి లింగారెడ్డి, జంగలం శంకర్, చందుపట్ల సురేష్, అక్కల రాజులను అదుపులోకి తీసుకున్నారు.

Five Janashakti naxalites arrested

వారి నుంచి రెండు తపంచాలు, కంట్రీమేడ్ రివాల్వర్, పిస్టల్ చేసుకున్నారు. వీరికి సహకరించిన శంకర్, సానుభూతి పరులపై కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్‌లో పట్టుబడిన జనశక్తి నేతలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పట్టుబడిన ఐదుగురితోపాటురాష్ట్ర కమిటీ నేతలైన కూర రాజన్న, దేవేందర్‌, విమలక్క, విఠల్‌రాజులతో కలిసి మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

English summary
Nizamabad district police arrested five Janashakti naxalites and seized arms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X