భ్రమపడి వేరే వ్యక్తిపై దాడి: సింగర్ మధుప్రియ తండ్రి అరెస్ట్
హైదరాబాద్: సింగర్ మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసుకు సంబంధించి ఆమె తండ్రి పెద్ద మల్లేశ్ను ఉప్పల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మల్లేశ్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వివరాల్లోకి వెళితే గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్కు చెందిన మహ్మద్ నయీమ్ (30) అనే వ్యక్తిని మధుప్రియ తండ్రి, బంధువులు చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మా ఆయన బంగారమే, కానీ...: సింగర్ మధుప్రియ, ఎపిసోడ్లో మరో ట్విస్ట్
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన ఉప్పల్ పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా తన భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ శనివారం రాత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి హైడ్రామా నడిచింది.
అనంతరం ఆదివారం సాయంత్రం పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం సింగర్ మధుప్రియ, శ్రీకాంత్లు బతికున్నంత కాలం తాము కలిసే జీవిస్తామని సోమవారం ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. తన తల్లిదండ్రుల వల్లే ఇంత పెద్ద గొడవ జరిగిందని మధుప్రియ చెప్పారు.
రోజంతా డ్రామా: మధుప్రియ ట్విస్ట్, ఎందుకు? (పిక్చర్స్)
తన తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గురించి తనకు నూరిపోశారని చెప్పారని తెలుస్తోంది. దీంతో, తాను అయోమయ పరిస్థితిలో పడ్డానని చెప్పారు. పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్ అనంతరం వాస్తవ విషయాలు బోధపడ్డాయన్నారు. తన జీవితంలో శ్రీకాంత్కు తప్ప మరొకరికి స్థానం లేదని ఆమె పేర్కొన్నారు.