బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపి సంఘీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ పార్లమెంటుసభ్యుడు(రాజ్యసభ) గిరీష్ సంఘీ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనా తీరుతో సంతృప్తి చెందినందువల్లనే బిజెపిలో చేరినట్లు గిరీష్ సంఘీ వ్యాఖ్యానించారు.
కాగా, బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంఘీకి పార్టీ కీలకమైన బాధ్యతలు అప్పజెప్పవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. గిరీష్ సంఘీతోపాటు రామ్ కైలాశ్ గుప్త తదితరులు అమిత్ షా, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ఎంపి విజయ్ గోయల్ సమక్షంలో బిజెపిలో చేరారు.
సంఘీ తెలుగు, హిందీ ‘వార్తా' దిన పత్రికలను నడుపున్న విషయం తెలిసిందే. మాజీ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆయన, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 2011లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు పంపించకపోవడంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది.
బిజెపిలో చేరిక
కాంగ్రెస్ మాజీ పార్లమెంటుసభ్యుడు(రాజ్యసభ) గిరీష్ సంఘీ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బిజెపిలో చేరిక
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
బిజెపిలో చేరిక
ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనా తీరుతో సంతృప్తి చెందినందువల్లనే బిజెపిలో చేరినట్లు గిరీష్ సంఘీ వ్యాఖ్యానించారు.
బిజెపిలో చేరిక
కాగా, బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంఘీకి పార్టీ కీలకమైన బాధ్యతలు అప్పజెప్పవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
బిజెపిలో చేరిక
గిరీష్ సంఘీతోపాటు రామ్ కైలాశ్ గుప్త తదితరులు అమిత్ షా, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ఎంపి విజయ్ గోయల్ సమక్షంలో బిజెపిలో చేరారు.
బిజెపిలో చేరిక
గిరీష్ సంఘీ తెలుగు, హిందీ ‘వార్తా' దిన పత్రికలను నడుపున్న విషయం తెలిసిందే.