అక్కడి నుండే కెసిఆర్ కు సెగ, ఆందోళనకారులకు విపక్షాల మద్దతు
మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.
మెదక్: మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.
మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా తొగుట మండలంలోని వేములఘాట్ గ్రామంలో స్థానికులు చేపట్టిన రిలేదీక్షలు ప్రారంభించి ఏడాదైనా సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళారీ వ్యవస్థను ఏర్పాటుచేసకొని ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా లాక్కొని రియల్ ఏస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఆరోపించారు. కెసిఆర్ క్యాబినెట్ లోని మంత్రులు కళ్ళుండి కూడ చూడలేని కబోదులుగా మారారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆరోపించారు.మంత్రులకు దివ్యాంగులుగా పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరారు.
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , మాజీ మంత్రి డికె అరుణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి , మాజీ ఎంపి వి.హనుమంతరావు లు దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.