మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారయణ, టీఆర్ఎస్కు రాజీనామా...
మాజీ ఆర్టీసీ చైర్మణ్ సోమారపు సత్యనారణ టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సత్యనారయణతోపాటు మరో పదిమంది మాజీ కార్పోరేటర్లు కూడ పార్టీకి రాజీనామ చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం లభించకపోవడంతో మనస్థాపం చెంది రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించాడు.
సీఎం కేసిఆర్ పిలిచి ఆర్టీసీ చైర్మణ్ పదవిని అప్పగించాడని, అలాంటీ నాకే పార్టీలో కనీస గౌరవం లేదని అన్నారు. తాజాగా పార్టీ సభ్యత్వ కార్యాక్రమంలో కూడ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రానున్న రామగుండం కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే మేయర్గా బరిలో ఉంటానని ప్రకటించిన ఆయన పార్టీ తన మద్దతు దారులకు ఎప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు.కాగా గత ఎన్ని ఎన్ని మాజీ ఎంపీతో పాటు పార్టీ ముఖ్యనాయకులే కారణమని ఆయన ఆరోపించారు.
కాగా ఎన్నికల్లో రామగుండం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన సోమారపు సత్యనారయణ ఇండిపెండెంట్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం చందర్ టీఆర్ఎస్ లో చేరాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరుడిగా ఉన్న కోరుకంటి చందర్ పార్టీలోకి రావడంతో రెండు వర్గాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఏర్పాడ్డాయి. ఇక అప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సత్యనారయణ టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.