హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర ప్రమాదం: చిన్నారులతోపాటు కుటుంబం దుర్మరణం

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి: జిల్లాలోని కాట్నపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మంథనిలోని కృష్ణవేణి పాఠశాల యజమాని అరుణ్ కుమార్.. భార్య సౌమ్యతో పాటు ఇద్దరు చిన్నారులు అఖిలేశ్‌, సౌమ్యలతో కలిసి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

 Four of family killed as car collides with stationary lorry

హైదరాబాద్‌లో అరుణ్‌కుమార్‌ తమ్ముడు సాయికుమార్, బావమరిది ఓంప్రకాశ్‌లను పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్ కల్పించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని గమనించక ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. గురువారం రాత్రి రెండు గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నలుగురి మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో విషాద వాతావరణం నెలకొంది.

English summary
Four members of family were killed on the spot when the car in which they were travelling collided with a stationary lorry at Katnapally in Peddapally district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X