నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు అక్కడికక్కడే మృతి..

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో.. అందులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలానికి చెందిన రాఘవేందర్‌(36), దీప్తి(34) దంపతులు తమ తేజస్‌ (10), సిగ్న(4)గా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్‌ నుంచి కోటగిరి వెళ్తున్నారు.

four killed in road accident in nizamabad

అదే సమయంలో నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో రాఘవేందర్‌, దీప్తిలతో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Four, including two children killed in a road accident on Monday in Dichpally, Nizamabad district. Police identified the dead bodies, they say all are belongs to one family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X