వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఊరు.. ఒకే చోట పని.. అనుమానస్పదంగా నలుగురి దుర్మరణం

|
Google Oneindia TeluguNews

మేడ్చల్‌ : ఆ నలుగురు స్నేహితులు. కలిసి పెరిగారు. కలిసి పనిచేద్దామనుకున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. నలుగురు ప్రాణాలు ఒకేసారి బలిగొంది. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన విషాదం నింపింది. నలుగురు యువకులు అనుమానస్పద స్థితిలో దుర్మరణం చెందడం కలకలం రేపింది. వీరంతా కూడా 20 నుంచి 25 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేశ్, సతీశ్, మహేందర్, అరవింద్ స్నేహితులు. ఒకే చోట పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేటలోని ఓ కోళ్లఫామ్ లో పనికి కుదిరారు. అయితే శుక్రవారం తెల్లవారేసరికి విగతజీవులుగా కనిపించారు.

four young persons died in suspicious

నెల కిందటే వీరు అక్కడ పనిలో చేరినట్లు తెలుస్తోంది. కోళ్లఫామ్ పక్కనే వీరు ఉండటానికి గది ఇచ్చారు యజమాని. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసినట్లు సమాచారం. కోళ్లకు స్టెరాయిడ్స్ ఇచ్చే పనిలో లేట్ నైట్ వరకు పనిచేసి.. భోజనం తిని పడుకున్నట్లుగా యజమాని చెబుతున్నారు. అయితే తెల్లారేసరికి వీరు చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Four young persons died going hot topic in medchal district. Mahesh, Satish, Mahendar and Arvind who belongs to venkatapur village of torrur mandal in mahabubabad district joined in poultry farm which is in medchal district. There are many suspicions about young guys death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X