వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీరు బాటిల్లో ఫంగస్: కింగ్ ఫిషర్‌పై కోర్టుకెళ్తామని యువకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలోని ఓ దుకాణంలో కొందరు యువకులు బీరు కొన్నారు. అందులోని ఓ బీరు సీసాలో ఫంగస్ వచ్చింది. దీంతో అవాక్కయిన ఆ యువకులు దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారట.

fungus in beer battle in Mahaboobnagar district

హైదరాబాదుకు చెందిన కొందరు యువకులు జిల్లాలోని కల్వకుర్తిలో గల ఓ వైన్ షాప్‌లో బీరు సీసాలు కొన్నారు. అందులో ఓ సీసాలో ఫంగస్ కనిపించింది. పురుగులు కూడా కనిపించాయి. దీంతో సదరు బీరు సీసా కంపెనీ పైన కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. ఆ బీరు సీసాలు కింగ్ ఫిషర్ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది.

fungus in beer battle in Mahaboobnagar district

బిటెక్ విద్యార్థి మృతి

వేగంగా వస్తున్న డిసిఎం ఓ బైకును ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సందీప్ తన స్నేహితుడు సాయితో కలిసి బైక్ పైన వస్తున్నాడు.

fungus in beer battle in Mahaboobnagar district

ఆ సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడిక అక్కడే మృతి చెందాడు. సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
fungus in beer battle in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X