బాలాపూర్ లడ్డూకు రికార్డ్ ధర: రూ.16.60 లక్షలు, దక్కించుకున్న శ్రీనివాస్ గుప్తా
భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రాధాన్యత ఉందో బాలాపూర్ లడ్డూకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.16.60 లక్షలు పలికింది. గత ఏడాది కంటే లక్ష రూపాయలు ఎక్కువ పలికింది. ఇప్పటి వరకు ఇది రికార్డ్ ధర. ఈ లడ్డూను దక్కించుకున్నవారు శ్రీనివాస్ గుప్తా. ఆర్యవైశ్య సంఘం తరఫున దీనిని దక్కించుకున్నారు.
ఈ గణేషుడి లడ్డూను ఎవరు దక్కించుకుంటారోనని అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ లడ్డూకు ఏటికి ఏడు క్రేజ్ పెరుగుతోంది. గత 25 ఏళ్లుగా ఈ లడ్డూను వేలం వేస్తున్నారు. 1994లో రూ.450 పలికిన లడ్డూ, గత ఏడాది (2017) రూ.15.60 లక్షలు పలికింది. ఈసారి గతం కంటే లక్ష ఎక్కువ పలికింది.
ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కోసం డీడీ కట్టి రేసులో నిలిచిన వారు శ్రీనివాస్ రెడ్డి (ఆర్యవైశ్య సంఘం), పన్నాల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి, కుప్పిరెడ్డి విజయభాస్కర రెడ్డి, పోరెడ్డి తిరుమల్ రెడ్డి - ఎర్ర మహేశ్వరి, మన్నే బల్వంత్ రెడ్డి, భువనగిరి శ్రీనివాస్ బ్రదర్స్, లొక్క యాదిరెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. చివరగా శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు.