ghmc elections 2020: టీడీపీ తొలి జాబితా విడుదల, జనసమితి అభ్యర్థులు వీరే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. గురువారం 90 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
GHMC ఎన్నికల్లో పోటీ చేయబోయే 90 మంది అభ్యర్థుల మొదటి జాబితా
Posted by Telangana Telugu Desam Party - TTDP on Thursday, November 19, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం తమ అభ్యర్థులు రెండో జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే ఇరుపార్టీలు 11 మందితో తొలి జాబితాను ప్రకటించగా, తాజాగా 15 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి.
సీపీఐ - సీపీఐ(ఎం) 2వ జాబితా-------------------------2020 డిశంబర్ 1న జరగబోయే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్...
Posted by Cpi Telangana on Thursday, November 19, 2020
ఇది ఇలావుండగా, తెలంగాణ జనసమితి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలో 27 డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాం విడుదల చేశారు.
తెలంగాణ జన సమితిGHMC అభ్యర్థుల మొదటి జాబితా27 మందితో విడుదల
Posted by Telangana Jana Samithi Party on Thursday, November 19, 2020
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 18 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే నాలుగు జాబితాల వారీగా 63 మందిని ప్రకటించింది. తాజా జాబితాతో కలిసి అభ్యర్థుల సంఖ్య 81కి చేరింది.