హైదరాబాదీలకు హెచ్చరిక: అలా చేస్తే.. ఇక క్రిమినల్ కేసులే!
ఇకనుంచి రోడ్లపై తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 10ప్రాంతాల్లో తవ్విన రోడ్లను జూన్10లోగా పునరుద్దరించాలని జలమండలి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వాసులకు, కాంట్రాక్టు పనులు చేపట్టే సంస్థలకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి ఉద్దేశపూర్వకంగానో, లేక పొరపాటునో రోడ్లపై గుంతలు తవ్వితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జూన్ 1వ తేదీ నుంచి ఈ కఠిన చర్యలు అమలవుతాయని చెప్పారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో జనార్థన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఇకనుంచి రోడ్లపై తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 10ప్రాంతాల్లో తవ్విన రోడ్లను జూన్10లోగా పునరుద్దరించాలని జలమండలి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం మీద జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో కాంట్రాక్టు సంస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇకనుంచి గుంతలు తవ్వితే క్రిమినల్ కేసులు తప్పవు కాబట్టి.. సామాన్య జనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే.