ప్రాధేయపడినా వినలేదు, వేధింపులు భరించలేక ఆ బాలిక ఏం చేసిందంటే?
ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లోని మీర్ పేటలో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లోని మీర్ పేటలో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని సైదాబాబాద్ కు చెందిన వాణి అనే బాలిక మీర్ పేటలో ని మురళీకృస్ణా నగర్ లోని చిన్నమ్మ లక్ష్మి వద్ద ఉంటోంది. వాణి కి తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమె తన చిన్నమ్మ లక్ష్లి వద్దే ఉంటుంది.
గతంలో హస్టల్ లో వాణి ఉండేది. ఏడు మాసాల క్రితం ఆమె చదువు మానేసింది. చిన్నమ్మతోనే ఉంటూ పనులకు వెళ్తోంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంతో అనే యువకుడు వాణిని కొన్నినెలలుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.
బుదవారం నాడు సాయంత్రం కూడ వాణిని ప్రేమించాలని శ్రీకాంత్ వేధించాడు. వాణి చిన్నమ్మ లక్ష్మి కూడ శ్రీకాంత్ ను ఈ విషయమై ప్రాధేయపడింది. తల్లిదండ్రులు లేని అమ్మాయి వాణి వెంటపడి వేధించకూడదని ఆమె కోరింది.
అయినా శ్రీకాంత్ మాత్రం తన వేధింపులను మాత్రం ఆపలేదు. ఈ వేధింపులకు తీవ్ర మనస్థాపానికి గురైన వాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.