వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మావతి సినిమా ప్రదర్శించొద్దు, ఆందోళన చేస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్‌లో పద్మావతి సినిమాపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ నిషేధం విధించారు. రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలోని నాలుగు సినిమా థియేటర్లకు ఈ సినిమా ప్రదర్శించకూడదని రాజా సింగ్ ఆదేశించారని సమాచారం.

పద్మావతి సినిమాపై మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిషేధం విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కానీ, యూపీ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు.

Goshamahal BJP MLA Raja Singh ‘bans’ Padmavat in Hyderabad

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాపై ఎలాంటి నిషేధం విధించలేదు. తన నియోజకవర్గంలోని రామకృష్ణ, సంతోష్, స్వప్న, మహేశ్వరీ, పరమేశ్వరీ, వెంకటరమణ థియేటర్ల యజమానులను కలిసి ఈ సినిమాను ప్రదర్శించకూడదని కోరినట్టు రాజాసింగ్ చెప్పారు.అయితే ఈ విషయమై ఈ సినిమా థియేటర్ల మేనేజర్లు మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలో సుమారు 15 లక్షల మంది రాజ్‌పుత్‌లు నివాసం ఉంటున్నారు. పద్మావతి సినిమా ప్రదర్శిస్తే ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని రాజా సింగ్ హెచ్చరించారు.అయితే తన నియోజకవర్గ పరిధిలో ఆందోళన చేయనున్నట్టు మాత్రం రాజాసింగ్ స్పష్టం చేశారు.

ఈ సినిమాను తెలంగాణలో నిషేధించాలని కోరేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలవనున్నట్టు రాజాసింగ్ చెప్పారు.ప్రభుత్వ అనుమతితో ఈ సినిమా విడులదలైతే థియేటర్లకు రక్షణ కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

English summary
Some theatre managers have been orally ordered not to screen the film Padmavat by Goshamahal BJP MLA Raja Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X