వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు, మొబైల్ యాప్ ఆవిష్కరణ కూడా...

|
Google Oneindia TeluguNews

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదివారం విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాత్రి 7.30 గంటలకు విందు ఉంటుందని పేర్కొన్నాయి. విందులో రాష్ట్రపతి దంపతులు, గవర్నర్ దంపతులతోపాటు మంత్రులు, నేతలు, అధికారులు పాల్గొంటారు. సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం సతీసమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఉంటారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఆదివారం విందు ఇస్తున్నారు. ప్రతీ ఏటా శీతకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌ వస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా విచ్చేశారు. దాదాపు 10 రోజులు హైదరాబాద్‌లో బసచేసి.. తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారు.

governer offer dinner for president of india

ఆదివారం నాటి విందు తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైట్ మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారులు కూడా ధ్రువీకరించారు.

English summary
governer Tamilisai Soundararajan offer dinner for president of india ramnath kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X