వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్వార్: బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి కత్తిపోట్లు
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పేట్బషీరాబాద్ పరిధిలోని మైసమ్మగూడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థి భువనేశ్వర్పై కత్తులతో తోటి విద్యార్థులు దాడి చేశారు. అడ్డొచ్చిన మరో విద్యార్థిని కత్తితో పొడిచారు. రోహిత్ అనే విద్యార్థి ఈ దాడికి సూత్రధారిగా గుర్తించారు.
ఈ ఘటన అనంతరం రోహిత్ పరారీ అయ్యాడు. నిందితుడు సివిల్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది.వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
అసలు విద్యార్థుల మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ గొడవకు కారణమైన విద్యార్థులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కత్తిపోట్లకు గురైన భీటెక్ విద్యార్థి భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
English summary
Two group clashes in a private engineering college on Friday . This incident was happened in Medchel district.B.tech final year student Bhuvaneshwar stabbed by opposition gang.police registered case.