హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్యలు గుత్తా జ్వాలాను కదిలించాయి: ఓఝా లక్ష, సానియా 3 లక్షల ఆర్థిక సాయం (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఆదివారం నాడు చెప్పారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాధ గాథలు రోజూ చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వేయి మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, ఇతర రైతులకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో... ప్రజలకు పిలుపునిచ్చి విరాళాలు సేకరిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన కొడుకు పేరు మీద పలువురు రైతు కుటుంబాలకు సాయం చేశారు.

పార్టీ పరంగాను కాంగ్రెస్ పార్టీ తనవంతుగా ఆదుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. ఇటీవల హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.50వేలు ఇచ్చారు. మరో రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.

Gutta and Ojha give Rs.1 lakh to bereaved family of ryot

ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా గుత్తా జ్వాలా, సానియా మీర్జాలు, క్రికెటర్ ప్రజ్ఞన్ ఓఝా తమవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

గుత్తా జ్వాలా, ప్రజ్ఞాన్ ఓఝా... ఇద్దరు చెరో లక్ష రపాయలు విరాళంగా ఇచ్చారు. సానియా మీర్జా రూ.3 లక్షలను ప్రకటించారు.

English summary
Gutta and Ojha give Rs.1 lakh o bereaved family of ryot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X