తెరాసలో చేరికపై గుత్తా మెలిక, నేను తెరాసలో చేరలేదని ఝలక్
పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా తెరాసలో చేరలేదని, ప్రస్తుతం తాను బయటి నుంచి మద్దతిస్తున్నానన్నారు.
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా తెరాసలో చేరలేదని, ప్రస్తుతం తాను బయటి నుంచి మద్దతిస్తున్నానని, అవసరం అనుకున్నప్పుడు చేరుతానని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్లోకి ఎంపీ గుత్తా: కండువా కప్పుకోకపోతే పార్టీ మారినట్లు కాదా?
ఆయన ఈ రోజు హైదరాబాదులో మాట్లాడారు. తాను తెరాసలో చేరలేదని, అలాంటప్పుడు తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనకు అసెంబ్లీకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేయనని తెలిపారు.
కాగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు గత రెండున్నరేళ్లలో తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఇందులో గుత్తా కూడా ఉన్నారు. మిగతా వారంతా పార్టీలే చేరే సమయంలో కండువా కప్పుకున్నారు.
కానీ, గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం నాడు తెరాస పార్టీ కండువా కప్పుకోలేదు. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన చెబుతున్నారు. తాను తెరాసలో చేరలేదని, పార్టీ కండువా కప్పుకోలేదంటున్నారు. ఆయన టెక్నికల్గా మాట్లాడటం గమనార్హం. ఆ రోజు తన వారికి పార్టీ కండువా కప్పించారు. గుత్తా మాత్రం గులాబీ కండువా కప్పుకోలేదు.