తెలంగాణలో గ్రూప్ 2 విద్యార్థులకు బిగ్ రిలీఫ్, రేపు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
హైదరాబాద్: ఓ వైపు రూ.500 నోట్లు, రూ.1000 నోట్ల రద్దు అంశం గందరగోళానికి దారి తీయగా.. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే విషయాన్ని ప్రకటించింది. శుక్రవారం నాడు గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అంశం సామాన్యులతో పాటు విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగించే పరిణామం. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వారు ఆనందించే అంశాన్ని వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయని ప్రకటించింది.
గ్రూప్ 2 పరీక్షలకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతన్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు వెల్లడించారు. మూడువేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఒక్కరోజు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయన్నారు.
మంత్రి మహేందర్ రెడ్డి కూడా మాట్లాడారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దైన రూ.500, రూ.1000 నోట్లను రేపు ఒక్కరోజుకు అనుమతిస్తామని, విద్యార్థులు ఆ నోట్లు ఇస్తే చెల్లుబాటు అవుతాయని చెప్పారు.