ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కవిత 'గ్రీన్' ఛాలెంజ్, ముగ్గురు హీరోయిన్లకు సైనా సవాల్
హైదరాబాద్: నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, సినీ దర్శకులు రాజమౌళిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాము చాలెంజ్ను కరిస్తున్నామని, మొక్కలు నాటుతామని వారు ప్రకటించారు.
శనివారం హైదరాబాద్లోని తన ఇంటి ముందు ఎంపి కవిత గ్రీన్ చాలెంజ్లో భాగంగా మూడు మొక్కలను నాటారు. మహమూద్ అలీ, రాధాకృష్ణ, రాజమౌళి, సైనా నెహ్వాల్ వీరు ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాల్సి ఉంటుంది.
ఈనెల అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేశారు. చాలెంజ్ను స్వీకరించిన కవిత మూడు మొక్కలు నాటి, మరో నలుగురికి సవాల్ విసిరారు.
Accepted priyanka’s nomination & Doing my bit for greener World !! I nominate miss @Nsaina, Deputy CM Mahmood Ali garu, RadhaKrishna garu @abntelugutv & @ssrajamouli garu to take up the green challenge!! Plant a sapling & spread the word for a greener better world!! #HarithaHaram pic.twitter.com/fTbp92JAzG
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 21, 2018
మొక్కలు నాటే కార్యక్రమం పోటీ తత్వంతో సాగేలా చేయడం చాలెంజ్ కార్యక్రమం ఉద్దేశ్యం. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, అతివృష్టి లేదంటే అనావృష్టి, వాతావరణ మార్పుల సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కవిత అన్నారు.
Thank you ma’am @RaoKavitha .. for nominating me . Let’s all together make our world greener and clean. Here’s my contribution and I further nominate @taapsee ,@ShraddhaKapoor and @eshagupta2811 to take up the green challenge. #HarithaHaram pic.twitter.com/mT7xyDh8FF
— Saina Nehwal (@NSaina) July 21, 2018
భవిష్యత్తు తరాలకు మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని కవిత చెప్పారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మొక్కలు నాటడమే కాదు.. ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా కవిత సవాల్ను స్వీకరించిన సైనా నెహ్వాల్ తన నివాసంలో మొక్కలు నాటారు. హీరోయిన్లు తాప్సీ పన్ను, శ్రద్ధా కపూర్, ఇషా గుప్తాలను నామినేట్ చేశారు. తనను నామినేట్ చేసినందుకు కవిత మేడమ్కు ధన్యవాదాలు అని, మనమంతా కలిసి భూమిని పచ్చగా, పరిశుభ్రంగా మారుద్దామని, ఇదిగో నా వంతుగా నేను మొక్కలు నాటానని పేర్కొన్నారు.