14వ అంతస్తు నుంచి దూకి.. హెచ్సీయూ స్కాలర్ ఆత్మహత్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి శనివారం కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
హైదరాబాద్: ప్రఖ్యాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జీఎస్టీ చారిత్రక అవసరం, దోపిడీదారులపై కఠిన వైఖరి : మోడీ
ఈ అపార్ట్ మెంట్ లోనే నివసిస్తున్న టాండన్ శనివారం సాయంత్రం అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. హెచ్సీయూలో జనరల్ స్టడీస్ లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్ టాండన్ తన తల్లితో కలిసి నల్లగండ్లలోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు.
అతడి తల్లి ముంబై వెళ్లగా, శనివారం ఇంట్లో విశాల్ ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడి స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం ప్రాంతమని, మరణించే ముందు అతడు తన కుటుంబ సభ్యులకు మెయిల్ పంపినట్లు గుర్తించామని చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.