పైలట్కు గుండెపోటు, వణికిపోయిన ప్రయాణికులు: శంషాబాద్లో సేఫ్గా..
విమానం గాల్లో ఉండగా ఆ విమాన పైలట్కు గుండెపోటు రావడంతో ప్రయాణికులంతా వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను కాపాడాలంటూ దేవుడికి మొరపెట్టుకున్నారు.
హైదరాబాద్: విమానం గాల్లో ఉండగా ఆ విమాన పైలట్కు గుండెపోటు రావడంతో ప్రయాణికులంతా వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను కాపాడాలంటూ దేవుడికి మొరపెట్టుకున్నారు. వారి ప్రార్థనలు ఫలించి, విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించాడు. వారు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
Recommended Video
Pilot
leaves
Kamineni
Srinivas
in
Flight
and
left
from
Airport
-
Oneindia
Telugu
దీంతో విమానంలో ఉన్న 225 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పైలట్ను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
Qatar airways plane Safely landed in Shamshabad airport after heart attack to pilot.
Story first published: Saturday, August 26, 2017, 9:50 [IST]