నగరంలో భారీ వర్షం: కమ్మేసిన మబ్బులు.. నాలుగింటికే చీకట్లు!
భారీ వర్షానికి రోడ్ల పైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడిక్కకడ ట్రాఫిక్ జామై వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో నగరవ్యాప్తంగా సాయంత్రమే చీకటి పడిన వాతావారణాన్ని తల
హైదరాబాద్: నిన్న మొన్నటిదాకా ఎండలకు తాళలేకపోయిన నగర జనం.. ప్రస్తుతం చల్లటి వాతావరణంలో సేదతీరుతున్నారు. గురువారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కీసర, నాగారం, కాప్రా, చర్లపల్లిలలో భారీ వర్షం పడింది.
భారీ వర్షానికి రోడ్ల పైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడిక్కకడ ట్రాఫిక్ జామై వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో నగరవ్యాప్తంగా సాయంత్రమే చీకటి పడిన వాతావారణాన్ని తలపిస్తోంది. వాహనదారులంతా లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈసారి అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.