నెక్లెస్ రోడ్డులో క్రిస్మస్ ఫెస్టివల్: కేసీఆర్పై సినీ నటుడు రాజా ప్రశంసలు
హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలను అధికారకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని టాలీవుడ్ సినీ నటుడు రాజా అన్నారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నెక్లెస్ రోడ్డులో క్రిస్మస్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు.
ఈ క్రిస్మస్ షాపింగ్ ఫెస్టివల్కు సంబంధించిన బ్రోచర్ను శనివారం బంజారాహిల్స్ రోడ్ నెం 4లోని ఆర్ఎన్డీ హోటల్లో టాలీవుడ్ హోరోయిన్ నేహాతో కలిసి రాజా ఆవిష్కరించారు. ఆనంతరం రాజా మాట్లాడారు.
క్రిస్మస్ సంతోషాన్ని రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ పంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ ఫెస్టివల్లో బైబిల్తో పాటు ఇతర క్రైస్తవ మత గ్రంధాలు, క్రిస్టమస్ ట్రీలు, స్టార్స్, లైటింగ్, డెకరేటివ్ ఆర్టికల్స్, శాంతా క్లాజ్ ఐడల్స్ అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో పాటు దుస్తులు, ఆభరణాలు, పుట్ వేర్తో పాటు పిల్లల కోసం గేమ్స్ లాంటి వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు బ్రదర్ కెన్నడీ, చిల్డ్రన్ మినిస్ట్రీస్ సంస్ద నుంచి సురేష్ పాల్గొన్నారు.