వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ భద్రతపై ఏం చేశారు?: ఈసీ, కేంద్రానికి హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు కేంద్ర సిబ్బందితో భద్రత కల్పించాలన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది. ఈ విషయంపై వివరాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కేంద్ర సిబ్బంది లేదా స్వతంత్ర సంస్థతో తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రేవంత్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచివున్నందున నలుగురు సిబ్బందితో భద్రత కల్పించాలని కోరారు.

'ఇది గెలుపు రూపాయి': ఆ పెద్దావిడ కాళ్లకు మొక్కిన మాజీ స్పీకర్ చారి, కంటతడి'ఇది గెలుపు రూపాయి': ఆ పెద్దావిడ కాళ్లకు మొక్కిన మాజీ స్పీకర్ చారి, కంటతడి

High Court asks EC and Centre on Revanth Reddys security details

ఈసీకి, కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసినప్పటికీ స్పందన రాలేదని రేవంత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని ఈసీ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తమకు ఆ వివరాలు అందించాలని ఈసీ, కేంద్రం తరపు న్యాయవాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారాని(అక్టోబర్ 26)కి వాయిదా వేసింది హైకోర్టు.

English summary
High Court on Wednesday asked Elections Commission and Central government on Congress leader Revanth Reddy's security issue details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X