లైంగిక వేధింపులు: డీఎస్ కుమారుడు సంజయ్కి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టి వేసింది.
కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. అయితే అరెస్టు విషయంలో సీఆర్ పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
భార్య, పిల్లలున్నారు, ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు: లైంగిక వేధింపులపై సంజయ్
శాంకరీ
విద్యా
సంస్థల
నిర్వాహకుడు
సంజయ్..
నర్సింగ్
కళాశాలల
విద్యార్థినులను
లైంగికంగా
వేధిస్తున్నారని
నిజామాబాద్
లో
కేసు
నమోదైన
విషయం
తెలిసిందే.
అయితే
తాను
ఏ
నేరం
చేయలేదని..
వ్యక్తిగత
కక్షతోనే
కేసు
నమోదు
చేశారని
సంజయ్
క్వాష్
పిటిషన్
లో
తెలిపారు.
పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. సంజయ్ పై కేసు కొట్టివేసేందుకు నిరాకరిచింది. విచారణ ప్రక్రియ నిలిపివేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. సీఆర్ పీసీ 41ఏ ప్రకారమే వ్యహరించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది.