కోమటిరెడ్డి-సంపత్ ఇష్యూ: టీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్, ఏజీపై ఘాటువ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం సీరియస్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
సంపత్, కోమటిరెడ్డిల ధిక్కారణ పిటిషన్ పైన హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అసెంబ్లీ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని అడిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మీరు ప్రభుత్వ న్యాయవాదా లేక పార్టీ తరఫు న్యాయవాదా అని అడిషనల్ ఏజీ రామచంద్ర రావును హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజుల్లోగా హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. లేదంటే అసెంబ్లీ కార్యదర్శి, సెక్రటరీ నేరుగా కోర్టుకు రావాల్సి ఉంటుందని సీరియస్ అయింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.