వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సర్కారుకు మరో షాక్: టీఆర్టీ నోటిఫికేషన్ సవరించాల్సిందేనన్న హైకోర్టు
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్టీకి సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉన్నందునా.. ఉద్యోగా
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్టీకి సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనని స్పష్టం చేసింది.
తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉన్నందునా.. ఉద్యోగాల భర్తీకి 31జిల్లాలను పరిగణలోకి తీసుకోవద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అంతకుముందు బుధవారంనాటి విచారణలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదిస్తూ.. పరీక్షల నిర్వహణను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని అభ్యర్థించారు.
Comments
English summary
Highcourt delivered verdict on TRT notification, court suggested changes to Govt orders
Story first published: Friday, November 24, 2017, 17:13 [IST]