హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కడున్నా శోభాయాత్రకు హాజరు: హిమాచల్ గవర్నర్ హోదాలో బండారు: తమిళిసైతో భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన స్వరాష్ట్రానికి వచ్చారు.

పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..

వినాయక విగ్రహాల శోభాయాత్రలో పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నగరంలోని మొజాంజాహి మార్కెట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాల స్వాగత కార్యక్రమానికి గవర్నర్ హోదాలో హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Himachal Governor Bandaru Dattatraya met Governor of Telangana Tamilisai Soundarrajan at Raj Bhavan

అంతకుముందు- ఆయన రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాదపూరకంగా కలిశారు. శాలువ కప్పి సన్మానించారు. వారిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం శోభాయాత్రతో తనకు ఉన్న అనుబంధాన్ని దత్తాత్రేయ ఆమెతో పంచుకున్నారు. తాను ఎక్కడ ఉన్నా శోభాయాత్రకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఈ కారణంతోనే తాను గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి వచ్చిందని అన్నారు.

English summary
After assuming charge as Governor of Himachal Pradesh, Bandaru Dattatraya reached his home state of Telangana on Thursday. Governor participated the Samoohik Ganpati Nimajjan Festival held at Mozam Jahi Market Bhagyanagar, Hyderabad as the chief guest. Before that Bandaru Dattatraya has met Governor of Telangana Tamilisai Soundarrajan at Raj Bhavan, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X