బాబాయ్ వరుస అయ్యే వ్యక్తితో ప్రేమ, పెళ్లి: హత్య చేసిన తండ్రి
రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో పరువు హత్య జరిగింది. నర్సింహ అనే వ్యక్తి తన కూతురును చంపేశాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి పక్కనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తిని కూతురు విజయ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సురేష్ను విజయ బాబాయి అని పిలిచేంది. దూరపు వరుసకు కూడా బాబాయి అవుతాడని తెలుస్తోంది.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని 17ఏళ్ల కొడుకును దారుణంగా చంపింది
ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు. సురేష్, విజయలు నాలుగేళ్లుగా వేరే గ్రామం వెళ్లి జీవిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంధువు మృతి చెందగా విజయ, సురేష్ గ్రామానికి వచ్చారు. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై తండ్రి అప్పటి నుంచే ఆగ్రహంతో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఆమె గ్రామానికి రాగా, ఇలా ఎందుకు చేశావంటూ... గురువారం కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. బుధవారం రాత్రి నుంచే తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అతను కూతురును హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, విజయ - సురేష్లకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఇటీవల సురేశ్ తల్లి మృతి చెందింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కనిపించని కుమార్తె ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో నర్సింహ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.