ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను కలిసి వివరాలు తెలుసుకున్నారు.కొద్ది సమయంలోనే ప్రకటించిన ఓటింగ్ శాతంలో తేడాలు వచ్చాయని ఎన్నికల అధికారిని ప్రశ్నించారు
జంటనగరాల్లో ఓటు వేసేందుకు ఓటువేసేందుకు ముందుకు రాని పరిస్థితి తెలిసిందే ఈనేపథ్యంలోనే నిన్న జరిగిన పోలింగ్ జంటనగరాల పార్లమెంట్ పరిధిలో రాష్ట్రంలో అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఒటింగ్ ముగిసిన సమయానికి ఈసి ప్రకటించిన లెక్కల ప్రకారం 39.49 శాతం నమోదైనట్టు తెలిపింది. అయితే మరి కోద్ది గంటల తర్వాత అది 46 శాతంగా నమోదైనట్టు మరో ప్రకటన జారీ చేసింది.దీంతో కొద్ది గంటల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుందని భావించిన సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి నేడు సంబంధిత ఎన్నికల అధికారిని కలిశారు. రెండు మూడు గంటల్లోనే ఓటింగ్ పెరుగుదల శాతం ఎలా పెరిగిందని ప్రశ్నించారు.దీంతో ఓటింగ్ ముగిసిన వెంటనే తమ బూత్ లెవల్ ఎన్నికల అధికారులు అందించిన సమాచారం మేరకు ప్రకటించామని , ఓట్లు పూర్తయిన తర్వాత అన్ని వివరాలు తెప్పించుకున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగిందని ఆర్వో తెలిపినట్టు ఆయన ప్రకటించారు.