టీఆర్ఎస్లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డి నోటీసులు ఇచ్చింది. వీరితోపాటు శాసనమండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది.
హైకోర్టులో పిటిషన్
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అప్పటి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇవ్వగా దానిని ఆయన ఆమోదించారు. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మండలి విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటిన్ చట్టవిరుద్దమైనదిగా ప్రకటించాలని వారు కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించింది. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలను ఆదేశించి .. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.